Breaking News

మజ్లిస్‌తో దేశానికి ప్రమాదం


Published on: 19 Jan 2026 15:05  IST

మజ్లిస్‌ పార్టీ నుంచి మన దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.ఈ పరిణామం ఒక్క హైదరాబాద్‌కో,తెలంగాణకో మాత్రమే పరిమితం కాలేదని, కాంగ్రెస్‌ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు వైద్యులు, పారామెడికల్‌ నిపుణులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి