Breaking News

అలిపిరిలో టౌన్‌షిప్‌.. బోర్డు సమష్టి నిర్ణయమే!


Published on: 14 Jan 2026 11:26  IST

తిరుపతి నగరం అలిపిరిలో టౌన్‌షి్‌ప నిర్మాణం అనేది బోర్డు సభ్యులందరూ చర్చించి తీసుకున్న సమష్టి నిర్ణయమని టీటీడీ స్పష్టం చేసింది. ఈనెల 12వ తేదీ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘ఈ తిరకాసేమిటి తిరుమలేశా?’’ అన్న శీర్షికన ప్రచురితమైన వార్తపై టీటీడీ స్పందించింది. భక్తుల సౌలభ్యం కోసం వారు సులువుగా చేరుకునే అలిపిరి ప్రాంతంలో వసతి సముదాయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని బోర్డు నిర్ణయించిందని దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి