Breaking News

చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావు..


Published on: 08 Jan 2026 16:24  IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌)’ (వీబీ-జీ రామ్‌ జీ)పై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విబ్ జీ రామ్ జీ పథకంపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. చట్టాలు రాతిపై చెక్కిన శిల్పాలు కావని అందరూ గుర్తించాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలో కూడా అనేక సవరణలు చేసుకున్నామని ప్రస్తావించారు. ఇవాళ రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటించారు. 

Follow us on , &

ఇవీ చదవండి