Breaking News

తదుపరి విచారణ వరకు వంశీని అరెస్ట్‌ చేయవద్దు


Published on: 03 Jan 2026 14:41  IST

వైసీపీనేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తదుపరి విచారణ వరకు అరెస్ట్‌ చేయవద్దని మాచవరం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నూతక్కి సునీల్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్యాయత్నం, తదితర సెక్షన్ల కింద విజయవాడ పరిధిలోని మాచవరం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. 

Follow us on , &

ఇవీ చదవండి