Breaking News

లిక్కర్‌ గ్యాంగ్‌కు 16 వరకు రిమాండ్‌


Published on: 03 Jan 2026 14:37  IST

మద్యం కుంభకోణంలో వివిధ జైళ్లలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్‌ నాయుడు, బూనేటి చాణక్య, అనిల్‌ చోక్రా, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నవీన్‌ కృష్ణ, బాలాజీ కుమార్‌ యాదవ్‌, రోణక్‌ కుమార్‌ను పోలీసులు ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. వారికి 16వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి