Breaking News

స్వగ్రామానికి జవాన్ సత్యనారాయణ మృతదేహం..


Published on: 02 Jan 2026 16:42  IST

పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలం బొండాడపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొర్రా సత్యనారాయణ (26) ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జవాన్ మృతితో బొండాడపేట గ్రామం మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.దేశ సేవలో నిమగ్నమైన యువ సైనికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి