Breaking News

వైసీపీకి ఊహించని షాక్..


Published on: 02 Jan 2026 15:41  IST

నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి (YSRCP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి (PV Pradeep Reddy) తెలుగుదేశం పార్టీలో ఇవాళ(శుక్రవారం) చేరారు. ఈ పరిణామం నంద్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సమక్షంలో పీవీ ప్రదీప్ రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి