Breaking News

టైగ‌ర్ అబీ జిందా హై..


Published on: 14 Nov 2025 15:11  IST

బీహార్‌లో నితీశ్ మ‌ళ్లీ దూసుకెళ్లున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం నితీశ్ కుమార్ పార్టీ మ‌ళ్లీ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఎన్డీఏ కూట‌మి 180 స్థానాల్లో అగ్ర‌స్థానంలో దూసుకెళ్తున్న‌ది. ఎన్డీఏ విక్ట‌రీ బీహార్‌లో ఖాయ‌మైంది. నితీశ్ ఖాతాలోనే ఆ స‌క్సెస్ ప‌డింది. ఇక సీఎం నితీశ్ ఇంటి ముందు ఇవాళ ఓ భారీ పోస్ట‌ర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. టైగ‌ర్ అబీ జిందా హై అంటూ ఆకట్టుకునే రీతిలో ఆ పోస్ట‌ర్ వేశారు. పులి ఇంకా బ్రతికే ఉంది అంటూ ఆ పోస్ట‌ర్‌పై పెద్ద అక్ష‌రాల్లో రాశారు.

Follow us on , &

ఇవీ చదవండి