Breaking News

తెరపైకి మరో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్..


Published on: 12 Nov 2025 15:30  IST

ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ మరోసారి బలంగా తెరపైకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే రాజు కేజ్ ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం ద్వారా ఈ ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోశారు. కర్ణాటక హోరాట సమితి, ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక వంటి సంఘాలు తమ డిమాండ్లను మరింత తీవ్రతరం చేశాయి. శీతాకాల సమావేశాల్లో తమ మూడు ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతే కర్ణాటక శాసనసభ భవనంపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని హెచ్చరించడం సంచలనం సృష్టించింది.

Follow us on , &

ఇవీ చదవండి