Breaking News

2026 సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) అదనంగా 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది

2026 సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) అదనంగా 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ 16 అదనపు రైళ్లు ప్రధానంగా సికింద్రాబాద్, వికారాబాద్ నుండి శ్రీకాకుళం రోడ్ వరకు గోదావరి జిల్లాల మీదుగా నడుస్తాయి.


Published on: 17 Dec 2025 10:59  IST

2026 సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) అదనంగా 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ 16 అదనపు రైళ్లు ప్రధానంగా సికింద్రాబాద్, వికారాబాద్ నుండి శ్రీకాకుళం రోడ్ వరకు గోదావరి జిల్లాల మీదుగా నడుస్తాయి.

చర్లపల్లి, ఖాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ (రాయన్నపాడు), ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, విజయనగరం వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.ఇప్పటికే ప్రకటించిన 41 రైళ్లతో కలిపి, తాజా 16 రైళ్లతో మొత్తం సంక్రాంతి స్పెషల్ రైళ్ల సంఖ్య 57కు చేరింది.

ఈ ప్రత్యేక రైళ్ల కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.సంక్రాంతి పండుగ ప్రయాణాల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక SCR వెబ్‌సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. 

Follow us on , &

ఇవీ చదవండి