Breaking News

2026 నూతన సంవత్సర కానుకగా షిర్డీ సాయిబాబాకు ఒక భక్తుడు రూ. 80 లక్షల విలువైన బంగారు, వజ్రాల కిరీటాన్ని సమర్పించారు.

2026 నూతన సంవత్సర కానుకగా షిర్డీ సాయిబాబాకు ఒక భక్తుడు రూ. 80 లక్షల విలువైన బంగారు, వజ్రాల కిరీటాన్ని సమర్పించారు.


Published on: 02 Jan 2026 18:01  IST

2026 నూతన సంవత్సర కానుకగా షిర్డీ సాయిబాబాకు ఒక భక్తుడు రూ. 80 లక్షల విలువైన బంగారు, వజ్రాల కిరీటాన్ని సమర్పించారు. హర్యానా రాష్ట్రం, ఫరీదాబాద్‌కు చెందిన సాయి భక్తుడు ప్రదీప్ మొహంతి మరియు ఆయన భార్య ప్రతిమా మొహంతి కలిసి ఈ కిరీటాన్ని సమర్పించారు.

ఈ కిరీటం మొత్తం బరువు 655 గ్రాములు.దీని తయారీలో 585 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారు. అలాగే కిరీటాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి 153 క్యారెట్ల విలువైన వజ్రాలను పొదిగారు.2026 కొత్త సంవత్సరం సందర్భంగా బాబాను దర్శించుకున్న ఈ దంపతులు, జనవరి 1వ తేదీ రాత్రి తమ మొక్కును చెల్లించుకున్నారు. జనవరి 2న షిర్డీ సాయిబాబా సంస్థాన్ అధికారులు ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. నూతన సంవత్సరం మొదటి రోజే బాబాకు ఇంత భారీ కానుక లభించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి