Breaking News

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ ఆస్ట్రేలియన్ అనుబంధ సంస్థ అయిన నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ తో భారీ సరఫరా ఒప్పందం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అమెరికా కంపెనీతో కాకుండా, ఆస్ట్రేలియాకు చెందిన మల్టీ-బిలియన్ డాలర్ల ఫార్మసీ నెట్‌వర్క్‌తో భారీ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.


Published on: 02 Jul 2026 12:34  IST

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ అమెరికా కంపెనీతో కాకుండా, ఆస్ట్రేలియాకు చెందిన మల్టీ-బిలియన్ డాలర్ల ఫార్మసీ నెట్వర్క్తో భారీ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జూలై 2026 మొదటి వారంలో ఈ అధికారిక ప్రకటన వెలువడింది.దాదాపు రూ. 1,300 కోట్లు .7.5 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది.ఈ దీర్ఘకాలిక ఒప్పందం జూలై 1, 2026 నుండి అమలుల్లోకి వచ్చింది.

సాయి పేరెంటరల్స్ యొక్క ఆస్ట్రేలియన్ అనుబంధ సంస్థ అయిన నౌమెడ్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఆస్ట్రేలియాలోని ఒక అతిపెద్ద, ప్రముఖ రీటైల్ ఫార్మసీ చైన్ నెట్‌వర్క్‌కు ఓటీసీ మందులను ఎక్స్‌క్లూసివ్‌గా సరఫరా చేయడానికి ఈ డీల్ కుదిరింది.

ఈ ఒప్పందం ద్వారా కంపెనీకి ఏటా సగటున రూ. 175 కోట్లు (27 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) ఆదాయం లభిస్తుంది.వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఒప్పందం కింద ప్రతి సంవత్సరం 12 కొత్త ఉత్పత్తులను ఆస్ట్రేలియా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.కఠినమైన నిబంధనలు ఉండే ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లో ఇంతటి భారీ కాంట్రాక్ట్ దక్కడం వల్ల సాయి పేరెంటరల్స్ యొక్క గ్లోబల్ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కె. అనిల్ కుమార్ తెలిపారు.

ఫార్మా రంగ మార్కెట్ అప్‌డేట్స్ ప్రకారం, జూలై 2, 2026న కంపెనీ ఇన్వెస్టర్లు మరియు అనలిస్టులతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాపార వృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక చర్చలు జరిపింది.

Follow us on , &

ఇవీ చదవండి