Breaking News

దేశ రాజధాని దిల్లీలోని ఒక థర్డ్-పార్టీ డేటా సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో భారతదేశంలో గూగుల్ క్లౌడ్సేవలకు అంతరాయం

దేశ రాజధాని దిల్లీలోని ఒక థర్డ్-పార్టీ డేటా సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 10 జూన్ 2026 బుధవారం నాడు భారతదేశంలో గూగుల్ క్లౌడ్సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌ పరిధిలోని టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తోన్న 'నెక్స్ట్-జెన్ టవర్' బ్యాటరీ రూమ్‌లో ఈ మంటలు చెలరేగాయి.


Published on: 10 Jun 2026 14:31  IST

దేశ రాజధాని దిల్లీలోని ఒక థర్డ్-పార్టీ డేటా సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 10 జూన్ 2026 బుధవారం నాడు భారతదేశంలో గూగుల్ క్లౌడ్సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌ పరిధిలోని టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తోన్న 'నెక్స్ట్-జెన్ టవర్' బ్యాటరీ రూమ్‌లో ఈ మంటలు చెలరేగాయి. భద్రతా చర్యల్లో భాగంగా నెట్‌వర్కింగ్ పరికరాలకు విద్యుత్ సరఫరాను అత్యవసరంగా నిలిపివేయడం వల్ల క్లౌడ్ సేవలు మందగించాయి.

ఢిల్లీతో పాటు ముంబయి, చెన్నై మరియు వాటి చుట్టుపక్కల ప్రాంతాలలో గూగుల్ క్లౌడ్ నెట్‌వర్క్ ట్రాఫిక్‌కు ఆటంకం కలిగింది.వినియోగదారులు తీవ్రమైన నెట్‌వర్క్ లేటెన్సీ, పాకెట్ లాస్ మరియు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నారు.

క్లౌడ్ ఆధారిత సేవలను వాడుతోన్న పలు ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల అంతర్గత సర్వర్లు, ప్రముఖ వెబ్‌సైట్లు మరియు మొబైల్ అప్లికేషన్ల నిర్వహణ తాత్కాలికంగా మందగించింది.అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

గూగుల్ క్లౌడ్ తీసుకుంటున్న చర్యలు

ట్రాఫిక్ డైవర్షన్: దిల్లీ కేంద్రంలో సామర్థ్యం తగ్గడంతో గూగుల్ క్లౌడ్ బృందం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను మళ్లించింది.గూగుల్ క్లౌడ్ తన అధికారిక స్టేటస్ పేజీలో ఇంజనీర్లు నెట్‌వర్క్‌ను స్థిరపరిచేందుకు, అదనపు ఇంటర్నెట్ ఎడ్జ్ పీరింగ్ ద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement