Breaking News

శ్రీశైలంలో కంబి మండపం ,200 గదుల నిర్మాణానికి భూమి పూజ

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న కంబి మండపం మరియు 200 గదుల యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి గురువారం (నవంబర్ 13, 2025) భూమి పూజ నిర్వహించారు.


Published on: 13 Nov 2025 15:43  IST

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న కంబి మండపం మరియు 200 గదుల యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి గురువారం (నవంబర్ 13, 2025) భూమి పూజ నిర్వహించారు. జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మరియు శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఈ భూమి పూజలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాల సమయంలో కర్ణాటక రాష్ట్రం నుండి అనేక మంది భక్తులు 'కంబి'లతో పాదయాత్రగా శ్రీశైలానికి వస్తారు. వారికి వసతి కల్పించడం ఈ సముదాయం ముఖ్య ఉద్దేశ్యం.ఈ నూతన సముదాయంలో 200 గదులు మరియు కంబి మండపం ఉంటాయి. 

Follow us on , &

ఇవీ చదవండి